AP : అనంతపురంలో ఏపీ ఉద్యోగుల మూడో దశ ఉద్యమం

X
By - Vijayanand |17 May 2023 4:53 PM IST
అనంతపురం జిల్లాలో ఏపీ ఉద్యోగులు మూడో దశ ఉద్యమం ప్రారంభమైంది. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్కోగులకు జగన్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాన్ని చూశారని.. ఇకపై తీవ్రస్థాయిలో జరుగుతుందని బొప్పరాజు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com