AP : మత్స్యకారులను జగన్ సర్కారు మోసం చేసింది: చంద్రబాబు

X
By - Vijayanand |18 May 2023 4:12 PM IST
బీసీలు, మత్స్యకారులను జగన్ సర్కారు మోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. విశాఖ పర్యటనలో రెండోరోజు మత్సక్యారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. సైకో పాలనలో 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. మత్స్యకారులను ఎస్టీల్లోకి తెచ్చే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జీవో 217పై పెట్టిన ఆంక్షలు తొలగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు చంద్రబాబు సమక్షంలో ముత్యాలమ్మపాలెం పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com