AP : మే 5న విశాఖలో 'ఉప్పెన' మహాసభ

X
By - Vijayanand |1 April 2023 8:51 AM IST
జగన్ సర్కారుపై ఏపీ ఉద్యోగులు పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. మే 5న విశాఖలో ఉప్పెన పేరుతో మహాసభ నిర్వహిస్తోంది. ఈమేరకు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పటికీ చేయలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ఇంకెన్ని వారాలు కావాలని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. పెన్షన్ ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే బిక్ష కాదని.. అది ఉద్యోగుల హక్కు అని బొప్పరాజు స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com