JanaSena : సొంత ఖర్చులతో చెత్తను తరలిస్తున్న జనసేన కౌన్సిలర్‌

JanaSena : సొంత ఖర్చులతో చెత్తను తరలిస్తున్న జనసేన కౌన్సిలర్‌
మూడు నెలలుగా చెత్తను శుభ్రం చేయని మున్సిపాలిటీ అధికారులు

అనకాపల్లి జిల్లా నర్శీపట్నంలో చెత్త సమస్యపై జనసేన సమరశంఖం పూరించింది. మూడు నెలలుగా చెత్త ఎత్తే యంత్రం మూలన పడ్డా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పెరిగిపోయింది. అయితే మున్సిపాలిటి 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్‌ మాత్రం తన స్వంత డబ్బులతో చెత్తను తరలిస్తున్నారు. కమిషనర్‌ ను కలసి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్‌ చెత్తను తరలించి కాలువలును శుభ్రం చేయించారు. ఈ నేపథ్యంలో పన్నులు వసూలు చేస్తూ చెత్తను తరలించక పోవడం దారుణమని జనసేన విమర్శిస్తుంది. చెత్త సమస్యను పరిష్కరించకపోతే నిరసనకు దిగుతామని జనసేన నేతలు వెల్లడిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story