AP : వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు
వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అం దజేశారు. ఈ నెల 12న ఉదయం 10గంటలకు కడప జైలు అతిథి గృహంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక ఈ కేసులో సీబీఐ అన్ని కోణాల్లోనూ విచారణ ముమ్మరం చేసింది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు.. ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో రెండుసార్లు విచారించింది. తా జాగా భాస్కర్రెడ్డిని విచారించడానికి నోటీసులిచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతోపాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు భాస్కర్రెడ్డిని విచారణకు పిలిచినట్లు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com