AP : సొంత పార్టీ ఎమ్మెల్యే భూమినే కబ్జా చేసిన వైసీపీ నేతలు
![AP : సొంత పార్టీ ఎమ్మెల్యే భూమినే కబ్జా చేసిన వైసీపీ నేతలు AP : సొంత పార్టీ ఎమ్మెల్యే భూమినే కబ్జా చేసిన వైసీపీ నేతలు](https://www.tv5news.in/h-upload/2023/03/06/914800-654.webp)
By - Vijayanand |6 March 2023 10:42 AM GMT
ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రశ్నించగా... రెండు సెంట్లే తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
సొంత పార్టీ ఎమ్మెల్యే స్థలాన్నే ఆక్రమించేశారు వైసీపీ నేతలు. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధకు కడప నగర శివారులో దాదాపు 27 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు, స్థలాన్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. 27 సెంట్ల భూమిని వైసీపీనేతలు అక్రమించగా.. ఇప్పుడు కేవలం రెండు సెంట్లు మాత్రమే ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రశ్నించగా... రెండు సెంట్లే తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డిని కలిశారు ఎమ్మెల్యే డాక్టర్ సుధ. తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోని కోరినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com