AP : మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం

AP : మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి. ఈ సందర్భంగా ప్రసగించిన ఆయన... సత్తెనపల్లి సీటుకోసం యుద్ధం చేయదలుచుకున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వైయస్సాఆర్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందరి అభిప్రాయాలతోనే భవిష్యత్‌ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి 4 వేల మందికి పైగా వస్తారని అంచనాఉందని.... ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్‌ దక్కేలా ప్రయత్నం చేస్తానన్నారు. సీటు విషయంలో హైకమాండ్‌ను కలుస్తానన్నారు వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి.

Tags

Next Story