AP : బ్రాండిక్స్ పరిశ్రమలో కార్మికులు ఆందోళన

X
By - Vijayanand |5 May 2023 9:45 AM IST
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZ లోని బ్రాండిక్స్ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగారు. సీడ్స్ విభాగంలో పనిచేస్తున్న వారిని వేరే విభాగానికి తరలిస్తుండంతో ఆందోళనకు దిగారు కార్మికులు. యాజమాన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా 2వేల మంది కార్మికులు రాత్రి పరిశ్రమలోనే ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో A- షిఫ్ట్, B- షిఫ్ట్ కార్మికులు పాల్గొన్నారు. అయితే… ఇవాళ ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో… ధర్నా విరమించారు కార్మికులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com