AP : అగమ్యగోచరంగా అన్నమయ్య జయంతి : రమేష్ నాయుడు
అన్నమయ్య జయంతి నిర్వహణపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర కార్యదర్ధి రమేష్ నాయుడు.అగమ్యగోచరంగా అన్నమయ్య జయంతిని నిర్వహిస్తున్నారని,జయంతికి ఆహ్వాన పత్రికలు కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా..? అంటూ విమర్శించారు.అన్నమయ్య ధ్యాన మందిరంలో పెచ్చులూడిన పరిస్థితి ఉందని,LDC,UDC స్థాయి ఉద్యోగులతో ఉత్సవాలను నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. తాళ్లపాకలోని చెన్నకేశవ స్వామి ఆలయ పూజారి చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుందని కనీసం అక్కడ స్వామి వారికి వస్త్రాలు కూడా మార్చే పరిస్ధితి లేదన్నారు. అన్నమయ్య ఉత్సవాలకు గతంలో సీఎంలు వచ్చేవారని,సొంత జిల్లాలో జరుగుతున్న అన్నమయ్య జయంతికి సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.జయంతి ఉత్సవాలపై కనీసం భక్తకోటికి సమాచారం ఇవ్వరా..? అన్న రమేష్ నాయుడు.. హిందువుల పండగలపై జగన్కు ఎందుకు అంత చిన్న చూపు అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com