AP : జగన్‌ పాలనలో బీసీలపై అక్రమ కేసులు : నారా లోకేష్

AP : జగన్‌ పాలనలో బీసీలపై అక్రమ కేసులు : నారా లోకేష్

జగన్‌ పాలనలో 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని నారా లోకేష్‌ మండిపడ్డారు. నందికొట్కూరు బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ అరాచకాలపై నిప్పులు చెరిగారు. జగన్‌ కుర్చీ, టేబుల్స్‌ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల భద్రత కోసం బీసీ రక్షణ చట్టం తెస్తామని.. న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీ వల్లనేనని పేర్కొన్నారు. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story