AP : క్రిష్టియన్ కమ్యూనిటీ హాల్కు దుస్థితి
By - Vijayanand |19 May 2023 10:23 AM GMT
గుంటూరు జిల్లాలో క్రిష్టియన్ కమ్యూనిటీ హాల్కు దుస్థితి పట్టింది.టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా 10కోట్లతో నల్లపాడులో క్రిస్టియన్ కమ్యూనిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు. టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పనులు శరవేగంగా జరిగాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ఆగిపోయాయి.ఎస్సీలకు అనేక పథకాలు చేశామని గొప్పలు చెపుతున్న జగన్ సర్కార్ నాలుగేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ ముందు ఆందోళన చేపడుతామంటున్న దళిత నేతలు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com