AP BJP : బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

AP BJP : బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ, అనుణ్ సింగ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో జాయిన్ అయ్యారు. కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ, అనుణ్ సింగ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన... బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో భాగంగానే తాజాగా బీజేపీలో జాయిన్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్ గా, ఏపీ 16వ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. రాష్ట్రం విడిపడ్డాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో జాయిన్ అవగా ఏపీ బీజేపీలో హుషారు వచ్చిందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నిర్ణయాత్మక అధికారాన్ని దక్కించుకోవాలని చేస్తున్నట్లు తెలుస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story