AP BJP : దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యం : నల్లారి కిరణ్ కుమార్

AP BJP : దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యం : నల్లారి కిరణ్ కుమార్
X
ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు.

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -09 మధ్య కాలంలో శాసనసభలో ప్రభుత్వ విప్ గా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. 2010 14 మధ్య కాలంలో ఏపీ 16వ సీఎంగా పనిచేశారు.ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు..ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ అనంతరం మళ్లీ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరారు. కానీ పెద్దగా యాక్టీవ్ గా లేరు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

కాంగ్రెస్‌ను రాజీనామా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్..2019లో 37 శాతానికి పైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.


తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు. అయితే ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం బీజేపీయేనన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందన్నారు. మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Tags

Next Story