పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
By - TV5 Digital Team |7 Jan 2021 9:24 AM GMT
పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలో రామతీర్థంలో భాగంగా బీజేపీ నేతలు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీనితో కాస్త అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com