బ్రేకింగ్.. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదు : కేంద్రం

బ్రేకింగ్.. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదు : కేంద్రం

మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై కేంద్ర హోంశాఖ మరింత స్పష్టతనిచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదన్న కేంద్రం... అందులో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని పేర్కొంది. కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలే అని హోంశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. అటు.. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామన్న కేంద్రం... రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story