ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో కేసులు చూస్తే..
ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో కేసులు చూస్తే... గత 24 గంటల్లో 73,625 శాంపిల్స్ ని పరీక్షించగా 5,653 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కొత్తగా ప్రకాశంలో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు,
పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడపలో ఒక్కరు , శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 6,659 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,47,622 పాజిటివ్ కేసు లకు గాను.. 6,94,804 మంది డిశ్చార్జ్ కాగా.. 6,194 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 46,624 గా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com