AP: కేంద్రం ఇచ్చిన నిధులు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: CPIరామకృష్ణ

AP: కేంద్రం ఇచ్చిన నిధులు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: CPIరామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం లాగేసుకుని పంచాయతీలను నిర్వీర్యం చేస్తుందని మండి పడ్డారు

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగేసుకుని పంచాయతీలను నిర్వీర్యం చేస్తుందని మండి పడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏపిలోని పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవటం సిగ్గుచేటని ఆక్షేపిచారు. త్రాగునీరు, రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస సౌకర్యాలకు ఏర్పాటు చేయడానికి పంచాయితీల్లో నిధులు కరువయ్యాయని విమర్శించారు. గత 6 నెలలుగా సర్పంచులు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పుకలగలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ప్రధానం చేసే అవార్డులలో.. తెలంగాణకు 10 అవార్డులు దక్కగా, ఏపీకి మొండిచేయి దక్కిందని విమర్శించారు. కేంద్రం నుంచి జగన్ సర్కార్ తీసుకున్న నిధులను వెంటనే పంచాయతీలకు అప్పగించాలని డిమాండ్ చేసారు.

Tags

Read MoreRead Less
Next Story