మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ ఎన్నికల కమిషన్

మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని SEC ఆరోపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని... కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అయితే కోవిడ్ సాకుతో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
Next Story