AP: ఏపీలో 44 బార్లకు ఈ-వేలం

ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సు ఫీజు, నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్సులు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజులు & రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.5 లక్షలు
50వేలు - 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.7.5 లక్షలు
5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.10 లక్షలు
ఆన్లైన్ వేలం ప్రక్రియలో అధిక మొత్తంలో బిడ్ వేసిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయించనున్నారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్ apcpe.aptonline.in లో అందుబాటులో ఉంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com