టీడీపి అధినేత చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు..
By - Nagesh Swarna |13 Oct 2020 12:49 PM GMT
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి సైతం మళ్లీ నోటీసులు పంపారు.
ఏపీలోని కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉండే నివాసాలకు మరోసారి అధికారులు నోటీసులిచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి సైతం మళ్లీ నోటీసులు పంపారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు. కరకట్ట నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందేనని.. సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవాహం చేరుకుంది. ఏ క్షణమైనా వరద ఇళ్లలోకి రావచ్చని రెవెన్యూ శాఖ ముందుగా అలెర్ట్ అయ్యింది. కాగా.. కృష్ణా నదిలో 6లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అటు.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com