మందు బాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం ధరలు సవరిస్తూ ఉత్తర్వులు
ఏపీ సర్కార్ దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను తగ్గించింది. ఇక బీర్లపై 30 రూపాలయను తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను తగ్గించింది. 150 రూపాయల కంటే తక్కువ ధరలు ఉన్న మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. 190 నుంచి 6వందల వరకు ఉన్న మద్యం ధరలను పెంచింది. గురువారం నుంచే ఈ సవరించిన మద్యం ధరలు అమలు కానున్నాయి. ఇక బీర్లపై 30 రూపాలయను ప్రభుత్వం తగ్గించింది.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలను సవరించాలని ఎస్ ఈబీ సిఫార్స్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మద్యం ధరలు పెరుగడంతో మద్యం ప్రియులు శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్ ఈ బీ మద్యం ధరలను సవరించాలంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ధరలను తగ్గించింది. 180 ml బాటిల్ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్లకు 30 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది ప్రభుత్వం.