ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ
By - Nagesh Swarna |8 Jan 2021 12:45 PM GMT
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ కొనసాగుతోంది. ఈ బృందంలో సీఎస్ తో పాటు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు.
పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా.. కరోనా, వ్యాక్సిన్ పంపిణీ షెడ్యూల్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇరువర్గాలను కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలనుసారం ఎస్ఈసీతో అధికారులు భేటీ అయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com