గుంటూరు జిల్లాలో బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిన దుండగులు

X
By - Nagesh Swarna |13 Feb 2021 11:15 AM IST
ఎన్నికల సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్ పత్రాలను అపహరించినట్లు తెలిసింది.
గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించాల్సిన బ్యాలెట్ పత్రాలు అపహరణకు గురయ్యాయి. వినుగొండ మండలం నడిగడ్డ పంచాయతీలోని బ్యాలెట్ పత్రాలను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఎన్నికల సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి పోలింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com