బిగ్ బ్రేకింగ్.. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు
By - Nagesh Swarna |6 Feb 2021 8:04 AM GMT
కనీసం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొదని డీజీపీకి ఆదేశాలిచ్చారు.
పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలంటూ సంచలన ఆదేశాలు ఇచ్చారు నిమ్మగడ్డ. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొదని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరిగేందుకు.. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు నిమ్మగడ్డ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com