AP : R5 జోన్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు అమరావతి రైతులు

AP : R5 జోన్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు అమరావతి రైతులు
X
విచారించాల్సిన కేసులు చాలా ఉన్నందున 14న విచారణకు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తెలిపారు

ఆర్‌5 జోన్ వ్యవహారంపై అమరావతి రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈనెల 14న విచారణ చేపడతామన్న సుప్రీం కోర్టు తెలిపింది. సోమవారం విచారణ చేపట్టాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారయ్యిందని.. విచారించాల్సిన కేసులు చాలా ఉన్నందున 14న విచారణకు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తెలిపారు. హైకోర్టులో ఆర్‌5 జోన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. రైతుల పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags

Next Story