APSRTC: తిరుమల కొండకూ ఉచిత బస్సు ప్రయాణం

APSRTC: తిరుమల కొండకూ ఉచిత బస్సు ప్రయాణం
X
శ్రీవారి దర్శనానికి ఉచిత బస్సులు... ఏపీఎస్ ఆర్టీసీ అధికారిక ప్రకటన... స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఉచిత బస్సు ప్ర­యా­ణం­పై మహి­ళ­ల్లో హర్షా­తి­రే­కా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. నె­ల­వా­రీ ఖర్చు­లు ఆదా అవు­తా­య­ని మహి­ళ­లు సం­తో­షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అయి­తే తా­జా­గా ఏపీ­ఎ­స్ ఆర్టీ­సీ మరో కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. తి­రు­మల కొం­డ­పై­కి వె­ళ్లే మహి­ళా భక్తు­ల­కు ఉచిత బస్సు పథకం వర్తి­స్తుం­ద­ని ఆర్టీ­సీ చై­ర్మ­న్‌ కొ­న­క­ళ్ల నా­రా­య­ణ­రా­వు తె­లి­పా­రు. ఘా­ట్‌­రో­డ్డు అయి­నం­దున ఆ బస్సు­ల్లో సి­టిం­గ్‌ వరకే అను­మ­తి ఉం­టుం­ద­ని చె­ప్పా­రు. అయి­తే ఎల­క్ట్రి­క్‌ బస్సు­ల్లో ఉచిత ప్ర­యా­ణం ఉం­డ­ద­ని కొ­న­క­ళ్ల పే­ర్కొ­న్నా­రు. మహి­ళ­ల­కు ఉచిత ఆర్టీ­సీ బస్సు ప్ర­యాణ సౌ­క­ర్యం తి­రు­మల కొం­డ­పై వరకు పొ­డి­గిం­చి­న­ట్లు చె­ప్పా­రు. అయి­తే ఘా­ట్‌ రో­డ్డు కా­వ­డం వల్ల సి­టిం­గ్‌ వరకే అను­మ­తి ఇస్తు­న్నా­మ­న్నా­రు. లే­దం­టే ప్ర­మా­దా­లు జరి­గే అవ­కా­శం ఉం­ద­న్నా­రు. " మొదట తి­రు­మల వె­ళ్లే మహి­ళ­ల­కు ఉచిత ప్ర­యా­ణం వర్తిం­చ­ద­ని తె­లి­పాం. కానీ మహి­ళల కో­రిక మే­ర­కు సీఎం చం­ద్ర­బా­బు కొం­డ­పై­కు వె­ళ్లే బస్సు­ల్లో కూడా అవ­కా­శం కల్పిం­చా­రు. అయి­తే ఘా­ట్‌ రో­డ్డు కా­వ­డం వల్ల సి­టిం­గ్‌ వరకే అను­మ­తి ఇస్తు­న్నాం. లే­క­పో­తే ప్ర­మా­దా­లు జరి­గే అవ­కా­శం ఉంది. మహి­ళ­లు అం­చ­నా­ల­కు మిం­చి ఆర్టీ­సీ­లో ప్ర­యా­ణం చే­స్తు­న్నా­రు. ఈ స్త్రీ శక్తి పథ­కం­తో మహి­ళ­ల­కు రో­జు­కు రూ.6.30 కో­ట్లు లబ్ధి చే­కూ­రు­తోం­ది. అని కొ­న­క­ళ్ల నా­రా­యణ తె­లి­పా­రు.

రోజుకు రూ.6.30 కోట్లు లబ్ధి

స్త్రీ శక్తి - మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యాణ పథ­కా­ని­కి అపూ­ర్వ స్పం­దన లభి­స్తోం­ద­ని ఏపీ­ఎ­స్‌­ఆ­ర్టీ­సీ ఛై­ర్మ­న్‌ కొ­న­క­ళ్ల నా­రా­య­ణ­రా­వు తె­లి­పా­రు. ఏపీ­లో ఈ నెల 16న 10 లక్షల మంది, 17న 15 లక్షల మంది, 18న 18 లక్షల మంది మహి­ళ­లు ఉచిత బస్సు ప్ర­యా­ణం చే­శా­ర­ని వి­వ­రిం­చా­రు. ఈ పథకం ద్వా­రా మహి­ళ­ల­కు రో­జు­కు రూ.6.30 కో­ట్లు లబ్ధి చే­కూ­రు­తోం­ద­న్నా­రు. ము­ఖ్యం­గా ఆసు­ప­త్రు­ల­కు, పు­ణ్య­క్షే­త్రా­ల­కు వె­ళ్లే­వా­రు, చి­రు­ద్యో­గా­లు చేసే మహి­ళ­లు ఈ పథ­కా­న్ని సద్వి­ని­యో­గం చే­సు­కుం­టు­న్నా­ర­ని నా­రా­యణ చె­ప్పా­రు. అం­త­కు ముం­దు ఆయన పలు­వు­రు మహి­ళా ప్ర­యా­ణి­కు­ల­తో మా­ట్లా­డా­రు. ఆధా­ర్‌ కా­ర్డు­లు పరి­శీ­లిం­చి, వా­రి­కి ఉచిత ప్ర­యాణ టి­కె­ట్లు అం­దిం­చా­రు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు అందిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు దాదాపు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.

Tags

Next Story