ప్రభుత్వం చేతగానితనం వల్లే ఏపీఎస్ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుంది : పట్టాభి

X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేతగానితనం వల్లే ఏపీఎస్ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందని.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. దసరా సమయంలో బస్సులు నడపడం చేతగాని ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరుగుతుంటే మంత్రి పేర్ని నాని ఏమయ్యారని ప్రశ్నించారు. సర్కారు చేతగానితనం వల్లే.. ఏపీఎస్ ఆర్టీసీ 3 వందలకు పైగా సర్వీసులను కోల్పోవాల్సి వచ్చిందని పట్టాభి మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
