అంతర్వేదిలో నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు

X
By - kasi |22 Sept 2020 1:43 PM IST
అంతర్వేదిలో నూతన రథం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే దేవాలయంలోని రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో రథం పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలకు రక్షణ లేదని.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల నిరసనతో అటు ప్రభుత్వం, ఆలయ కమిటీ దిద్దబాటు చర్యలు చేపట్టారు. కొత్తగా రథాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకోసం రావులపాలెం నుంచి దేవస్థానానికి టేకు కలపను తీసుకొచ్చారు. వంశపారంపర్యంగా రథం వాహనకారుల చేతనే లారీ నుంచి కలపను కిందకు దించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com