జైల్‌ భరో కార్యక్రమానికి వచ్చిన రైతులు ఎక్కడికక్కడ అరెస్ట్

జైల్‌ భరో కార్యక్రమానికి వచ్చిన రైతులు ఎక్కడికక్కడ అరెస్ట్

గుంటూరులో సబ్‌ జైలు వద్ద ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జైల్‌ భరో కార్యక్రమానికి వచ్చిన రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. కొంత మందిని అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మహిళా జేఏసీ నేత రాయపాటి శైలజతో సహా మరికొందరి రైతులను తాడికొండ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. కేవలం అధికారపార్టీకే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story