రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదు : అశోకగజపతిరాజు

రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదు :  అశోకగజపతిరాజు
ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదని, శాసనపరంగా, పరిపాలన పరంగా కూడా జరుగుతున్నాయని మాజీ మంత్రి అశోకగజపతిరాజు విమర్శించారు

ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదని, శాసనపరంగా, పరిపాలన పరంగా కూడా జరుగుతున్నాయని మాజీ మంత్రి అశోకగజపతిరాజు విమర్శించారు. ధర్మాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల పైన విచారణ కోసం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయమన్నా వినిపించుకోలేదన్నారు. అసలు ఎవరిని ఏ పదవుల్లో నియమిస్తున్నారో తెలియడం లేదన్నారు. దేవుడిపై నమ్మకం లేనివారిని దైవసేవ చేయమంటే ఫలితం ఉంటుందా అని ప్రశ్నించారు. జైల్లో ఉన్న వ్యక్తులను, బెయిల్‌పై విడుదలై వచ్చిన వ్యక్తులను కమిటీలకు ఛైర్మన్‌గా వేస్తున్నారని అశోక గజపతిరాజు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story