రామతీర్థం ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలిగింపు!
By - TV5 Digital Team |2 Jan 2021 12:18 PM GMT
రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తోలిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
రామతీర్థంలో చంద్రబాబు పర్యటనపై సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. రామతీర్థం ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోకగజపతి రాజును తొలగించారు. ఈ ఆలయానికి ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. దీంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయాల ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి కూడా ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పర్యవేక్షణలో అశోక్ గజపతిరాజు విఫలం అయ్యారని దేవాదాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com