ATTACK: మహా న్యూస్‌ ఛానల్‌పై దాడిని ఖండించిన ముఖ్యమంత్రులు

ATTACK: మహా న్యూస్‌ ఛానల్‌పై దాడిని ఖండించిన ముఖ్యమంత్రులు
X
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదని స్పష్టీకరణ

హై­ద­రా­బా­ద్‌ జూ­బ్లీ­హి­ల్స్‌­లో ఉద్రి­క్త పరి­స్థి­తు­లు తలె­త్తా­యి. మహా న్యూ­స్ టీవీ ఛా­న­ల్‌­‌­పై బీ­ఆ­ర్ఎ­స్‌­కు చెం­దిన కొం­త­మం­ది కా­ర్య­క­ర్త­లు దాడి చే­శా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో కే­టీ­ఆ­ర్‌­కు వ్య­తి­రే­కం­గా అభ్యం­త­ర­కర వా­ర్త­లు ప్ర­సా­రం చే­స్తు­న్నా­ర­ని బీ­ఆ­ర్ఎ­స్ కా­ర్య­క­ర్త­లు ఆరో­పిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో­నే మహా­న్యూ­స్ ఛా­నె­ల్ మీద దాడి జరి­గిం­ది. అయి­తే దాడి జరి­గిన సమ­యం­లో.. హీరో సు­హా­స్ మహా న్యూ­స్ ఛా­నె­ల్ స్టూ­డి­యో­లో ఉన్న­ట్లు తె­లి­సిం­ది. ఓ చి­త్ర ప్ర­మో­ష­న్ కోసం సు­హా­స్ మహా­న్యూ­స్ స్టూ­డి­యో­లో ఉన్నా­రు. ఈ సమ­యం­లో­నే దాడి జర­గ్గా.. సు­హా­స్ అక్క­డి నుం­చి వె­ళ్లి­పో­యి­న­ట్లు తె­లి­సిం­ది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో ఇలా దాడి చేస్తారని మహా న్యూస్ వర్గాలు కూడా అనుకోలేదు. దాంతో పెద్దగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోలేదు. దాంతోదాడి చేసిన వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయినట్లయింది.

తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

ఈ ఘట­న­పై ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. ప్ర­జా­స్వా­మ్యం­లో ఇలాం­టి దా­డు­ల­కు ఎలాం­టి స్థా­నం లే­ద­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. మీ­డి­యా సం­స్థ­ల­పై దాడి చే­య­డం అత్యంత దా­రు­ణ­మైన చర్య­గా అభి­వ­ర్ణిం­చా­రు. బె­ది­రిం­పు­లు, బల­వం­త­పు చర్య­ల­తో మీ­డి­యా స్వే­చ్ఛ­ను ఆపా­ల­నే ప్ర­య­త్నం ప్ర­జా­స్వా­మ్యా­ని­కి పె­ద్ద దె­బ్బ అని స్ప­ష్టం చే­శా­రు. ఈ దా­డి­పై ఆం­ధ్ర­ప్ర­దే­శ్ డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ కూడా రి­యా­క్ట్ అయ్యా­రు. "మీ­డి­యా సం­స్థ­లు ప్ర­సా­రం చేసే కథ­నా­ల­పై అభ్యం­త­రా­లు ఉంటే, వా­టి­ని వ్య­క్తీ­క­రిం­చేం­దు­కు చట్ట­బ­ద్ధ­మైన, ప్ర­జా­స్వా­మ్య మా­ర్గా­లు­న్నా­య­న్నా­రు. కానీ నే­రు­గా భౌ­తిక దా­డు­ల­కు పా­ల్ప­డ­డం అత్యంత గర్హ­నీ­య­మైన చర్య" అని పే­ర్కొ­న్నా­రు. ఇలాం­టి చర్య­లు ప్ర­జా­స్వా­మ్య స్పూ­ర్తి­కి వి­రు­ద్ధ­మ­ని, మీ­డి­యా గొం­తు నొ­క్కే యత్నా­ల­ను ఏ ఒక్క­రూ సహిం­చ­కూ­డ­ద­ని పి­లు­పు­ని­చ్చా­రు.

మహా న్యూస్‌పై దాడి దుర్మార్గం: సీఎం

హై­ద­రా­బా­ద్‌­లో­ని మహా­న్యూ­స్‌ చా­నె­ల్ ప్ర­ధాన కా­ర్యా­ల­యం­పై జరి­గిన దా­డి­ని సీఎం రే­వం­త్ రె­డ్డి తీ­వ్రం­గా ఖం­డిం­చా­రు. ఈ ఘట­న­ను ప్ర­జా­స్వా­మ్య వి­లు­వ­ల­కు వి­రు­ద్ధ­మైన హేయ చర్య­గా అభి­వ­ర్ణిం­చా­రు. మీ­డి­యా సం­స్థ­ల­పై ఇలాం­టి దా­డు­లు ఎవరూ సమ­ర్థిం­చ­లే­ని­వ­ని ఆయన X ద్వా­రా వె­ల్ల­డిం­చా­రు. ఈ ఘట­న­పై ఇప్ప­టి­కే డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క, మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్ కూడా తమ అస­హ­నా­న్ని వ్య­క్తం చే­శా­రు. ఈ ఘట­న­పై చం­ద్ర­బా­బు తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. ప్ర­జా­స్వా­మ్యం­లో దా­డు­ల­కు స్థా­నం లే­ద­ని పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story