పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని.. విధుల నుండి తొలగింపు..!

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని.. విధుల నుండి తొలగింపు..!
పంచాయతీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేశారని అనుమానంతో జడ్పీ హైస్కూల్లో పొట్నూరి లక్ష్మి అనే స్వీపరును విధుల నుండి తొలగించారు అధికారులు.

పంచాయతీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేశారని అనుమానంతో జడ్పీ హైస్కూల్లో పొట్నూరి లక్ష్మి అనే స్వీపరును విధుల నుండి తొలగించారు అధికారులు. దీంతో లక్ష్మి.. దివ్యాంగుడైన భర్త, దివ్యాంగురాలైన కూతుర్లతో కలిసి ఆందోళన చేపట్టింది. గుర్ల మండలం పాలవలస జడ్పీ హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మి పాలవలస జడ్పీ హైస్కూల్లో గత కొన్నేళ్లుగా స్వీపరుగా పనిచేస్తోంది. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసిందన్న అనుమానంతో ఆమెను విధుల నుండి తొలగించారు అధికారులు. వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని లక్ష్మి ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిడికి అధికారులు, హైస్కూల్ సిబ్బంది తలొగ్గారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story