Balakrishna: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై బాలకృష్ణ అసహనం

X
By - Prasanna |18 Oct 2021 12:00 PM IST
Balakrishna: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
Balakrishna: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యంతో పాటు వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అయితే వైద్యుల నిర్లక్ష్యంతో రెండు రోజుల పసికందు చనిపోయిందంటూ బాలకృష్ణ ముందు శ్రావణ్ అనే వ్యక్తి కన్నీటిపర్యంతమైయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ.. ఆస్పత్రి సూపరింటెండెంట్ని పిలిచి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com