BANAKACHARLA: తెలుగు రాష్ట్రాల మధ్య 'బనకచర్ల' చిచ్చు

BANAKACHARLA: తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల చిచ్చు
X
తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న నీటి వివాదం

తె­లం­గాణ, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మధ్య నీటి వి­వా­దం రా­ష్ట్ర వి­భ­జన తర్వాత నుం­చి కొ­న­సా­గు­తు­న్న ప్ర­ధాన సమ­స్య­ల­లో ఒకటి. ఇటీ­వల ఏపీ సర్కా­రు ప్ర­తి­పా­దిం­చిన గో­దా­వ­రి-బన­క­చ­ర్ల లిం­క్ ప్రా­జె­క్ట్‌­తో ఈ వి­వా­దం మరింత ము­ది­రి పా­కా­న­ప­డిం­ది. ఈ ప్రా­జె­క్ట్ ద్వా­రా గో­దా­వ­రి వరద జలా­ల­ను రా­య­ల­సీమ, నె­ల్లూ­రు, ప్ర­కా­శం జి­ల్లా­ల­కు తర­లిం­చా­ల­ని ఏపీ టా­ర్గె­ట్‌­గా పె­ట్టు­కుం­ది. అయి­తే, ఈ ప్రా­జె­క్ట్ గో­దా­వ­రి జల వి­వాద ట్రి­బ్యు­న­ల్, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ పు­న­ర్వ్య­వ­స్థీ­క­రణ చట్టం-2014 ని­బం­ధ­న­ల­ను ఉల్లం­ఘి­స్తుం­ద­ని, తమ నీటి హక్కు­ల­కు భంగం కలి­గి­స్తుం­ద­ని తె­లం­గాణ ప్ర­భు­త్వం ఆరో­పి­స్తోం­ది.

అసలు ఏమిటీ వివాదం...?

బనకచర్ల ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకోవడం. ఏపీ ప్రభుత్వం ఈ నీటిని పోలవరం ప్రాజెక్ట్ నుంచి బొల్లపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు తరలించి, రాయలసీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఏపీ వాదిస్తోంది. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ తమ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నీటి వాటాలను తగ్గిస్తుందని, రైతులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయపరంగా తెలంగాణ

ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు చట్ట, న్యాయపర చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 22, 2025న కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన తెలంగాణ, ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాలని స్పష్టంగా కోరింది. జూన్ 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించింది. జులై మొదటి వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం సముద్రంలోకి పోయే నీటినే తాము వినియోగిస్తున్నామని, ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు ఏ మాత్రం నష్టం జరగదని వాదిస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

ప్రతిపక్షాల విమర్శలు

గతం­లో బీ­ఆ­ర్ఎ­స్ ప్ర­భు­త్వం 400 టీ­ఎం­సీల నీ­టి­ని ఏపీ­కి ఇచ్చిం­ద­ని కాం­గ్రె­స్ ఆరో­పి­స్తు­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ నేత హరీ­శ్ రావు తె­లం­గాణ హక్కు­ల­ను కాం­గ్రె­స్ ఆం­ధ్రా­కు తా­క­ట్టు పె­డు­తోం­ద­ని వి­మ­ర్శి­స్తు­న్నా­రు. బీ­జే­పీ నే­త­లు ఈ వి­ష­యం­లో స్ప­ష్ట­మైన వై­ఖ­రి తీ­సు­కో­క­పో­వ­డం గమ­నా­ర్హం. కేం­ద్రం ఈ వి­వా­దం­లో రెం­డు రా­ష్ట్రాల మధ్య సమ­న్వ­యం కు­ది­ర్చేం­దు­కు చర్య­లు తీ­సు­కో­వా­ల్సిన అవ­స­రం ఉంది. గో­దా­వ­రి, కృ­ష్ణా నదు­ల­పై స్ప­ష్ట­మైన నీటి కే­టా­యిం­పు ని­ర్ణ­యా­లు, అపె­క్స్ కౌ­న్సి­ల్ ద్వా­రా చర్చ­లు జర­ప­డం ఈ సమ­స్య­కు దీ­ర్ఘ­కా­లిక పరి­ష్కా­రం తె­చ్చేం­దు­కు ఉప­యో­గ­ప­డ­వ­చ్చు.నీటి వన­రుల వి­ని­యో­గం­లో రెం­డు రా­ష్ట్రా­లు పర­స్పర సహ­కా­రం­తో ముం­దు­కు సా­గా­లి. రా­జ­కీయ లబ్ధి కంటే రై­తు­లు, ప్ర­జల ప్ర­యో­జ­నా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­వా­లి. చట్ట­బ­ద్ధ­మైన, న్యా­య­మైన పరి­ష్కా­రం కోసం కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు కలి­సి పని­చే­యా­లి. బన­క­చ­ర్ల ప్రా­జె­క్ట్ వి­వా­దం రెం­డు తె­లు­గు రా­ష్ట్రాల మధ్య సా­మ­ర­స్యా­ని­కి పరీ­క్ష­గా ని­లు­స్తోం­ది. దీ­ని­ని పరి­ష్క­రిం­చే ది­శ­గా చర్య­లు తీ­సు­కో­కుం­టే నీటి వి­వా­దా­లు తలె­త్తే ప్ర­మా­దం ఉంది.

గేమ్‌ ఛేంజర్ అవుతుంది : చంద్రబాబు

బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు ఆం­ధ్ర­ప్ర­దే­శ్కు ‘గేమ్ ఛేం­జ­ర్’ అవు­తుం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు ఇటీ­వల తె­లి­పా­రు. దే­శం­లో­ని అతి­పె­ద్ద ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చ­ర్‌­‌­గా అవ­త­రి­స్తుం­ద­ని కూడా ఆయన వె­ల్ల­డిం­చా­రు. గో­దా­వ­రి వరద నీ­టి­ని మా­త్ర­మే తర­లి­స్తా­మ­ని, ఈ ప్రా­జె­క్ట్‌ కా­ర­ణం­గా తె­లం­గా­ణ­కు ఏ మా­త్రం నష్టం ఉం­డ­ద­ని స్ప­ష్టం చే­శా­రు. రెం­డు నుం­చి మూడు నె­ల­ల్లో­నే టెం­డ­ర్లు పి­ల­వ­డా­ని­కి డీ­టై­ల్డ్ ప్రా­జె­క్ట్‌ రి­పో­ర్ట్‌ పూ­ర్తి చేసి టెం­డ­ర్లు పి­లు­స్తా­మ­ని తె­లి­పా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు కట్టు­కు­నే సమ­యం­లో ఏపీ నుం­చి ఏ వి­ధ­మైన అభ్యం­త­రా­ల­ను చె­ప్ప­లే­ద­ని గు­ర్తు­చే­శా­రు. ప్రా­జె­క్టు ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి కేం­ద్రా­ని­కి ని­వే­దిక పం­పి­స్తు­న్నా­మ­ని, హై­బ్రి­డ్‌ వి­ధా­నం­లో ని­ధుల సమీ­క­ర­ణ­కు ప్ర­ణా­ళి­క­లు సి­ద్దం చే­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. ఈ ప్రా­జె­క్టు­పై తె­లం­గా­ణ­కు గల అను­మా­నా­ల­ను ని­వృ­త్తి చే­యా­ల­ని క్యా­బి­నె­ట్‌ సమా­వే­శం­లో ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్టు తె­లి­పా­రు. తమ రా­ష్ట్ర నీటి హక్కు­ల­ను బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు హరి­స్తుం­ద­ని తె­లం­గాణ చే­స్తు­న్న ఆరో­ప­ణ­ల­ను సీఎం చం­ద్ర­బా­బు ఖం­డిం­చా­రు. తెలుగు రాష్ట్రాల పట్టింపులతో బనకచర్ల వివాదం తీవ్రమవుతోంది.


Tags

Next Story