Nandyal: వైసీపీకి భారీ షాక్.. పార్టీ వీడుతున్న నాయకులు
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీకి భారీ షాక్ తగులుతోంది. బనగానపల్లె సెగ్మెంట్లో వైసీపీ యువనేతలు ఒక్కొక్కరిగా పార్టీ గుడ్బై చెబుతున్నారు. గుర్తింపులేక. అభివృద్ధి లేక టీడీపీలో చేరిపోతున్నారు. తాజాగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబానికి చెందిన కాటసాని రమాకాంత్ వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు.
ప్రస్తుతం ఆయన అవుకు మండలం సింగవరం సర్పంచ్గా ఉన్నారు. సారీ సీఎం జగన్ అంటూ కాటసాని రమాకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న యువనేత కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి ఇటీవలే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కాటసాని రమాకాంత్ సైతం టీడీపీలోకి వస్తుండడంతో నంద్యాల జిల్లాలో వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com