BJP: 'సీఎం రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి'

ఉప రాష్ట్రపతి పదవిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని.. అలాగే తెలగు వారికి సరైన గౌరవం దక్కుతుందని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ మాటలు ఇండియా కూటమి తరుపున కాదని.. తెలంగాణ ప్రజల తరుపున మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. నోబెల్ కాదు.. గోబెల్స్ ప్రచారం ప్రైజ్ ఇవ్వొచ్చని విమర్శించారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ కోరడం సంతోషాన్చిందని... అయితే తాను కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక డిమాండ్ చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు లేదా? పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అగ్ర కుల పార్టీ: కాంగ్రెస్
బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా అధిష్ఠానాన్ని ఎంపీ రఘునందన్రావు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావొద్దని ఆయన కోరుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మీ అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అన్ని అవకాశాలు కల్పించి తీరుతాం. బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్రెడ్డి బీసీ బిల్లు తీసుకొచ్చారు. కాంగ్రెస్కు రఘునందన్రావు పాఠాలు అవసరం లేదు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్. మీ వల్ల కాకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదించుకుంటాం’’అని ఆది శ్రీనివాస్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com