ఏపీలో పోలీసులతో పాలన కొనసాగిస్తారేమో : విష్ణువర్ధన్ రెడ్డి

X
By - kasi |23 Sept 2020 1:02 PM IST
తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లేముందు సీఎం జగన్ తప్పని సరిగా డిక్లరేషన్ ఫాం ఇచ్చి వెళ్లాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడే హిందూ ధర్మాన్ని గౌరవిస్తే.. జగన్ ఎందుకు గౌరవించరని ప్రశ్నించారు. సీఎం తిరుమలకు వెళ్తుంటే.. స్థానిక టీడీపీ, బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి చూస్తుంటే పోలీసులతో పాలన కొనసాగిస్తున్నారేమో అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com