Amalapuram: అమలాపురం బాణసంచా కేంద్రంలో పేలుడు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని రావులచెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాణసంచా తయారీ చేస్తున్న ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిసర ప్రాంతాల్లోని మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మరికొందరిని కిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.
పేలుడు ధాటికి రెండస్తుల భవనం కుప్పకూలింది. ఇంట్లో దీపావళి మందు గుండు సామగ్రి తయారీ చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్ సాయంతో తొలగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com