చిత్తూరు జిల్లా రేణిగుంటలో పేలుడు
By - Nagesh Swarna |8 Dec 2020 2:21 PM GMT
చిత్తూరు జిల్లా రేణిగుంటలో పెను ప్రమాదం తప్పింది. రేణిగుంటలోని కడప రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద బాక్స్ పేలి పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శశికళ అనే మహిళను ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా శబ్ధం రావడంతో తారకరామనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. అర్బన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాక్సులో నాటు బాంబులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com