Breaking News : TSRTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం

X
By - Vijayanand |29 Jan 2023 5:34 PM IST
శ్రీశైలం డ్యాం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సు జలాశయం మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించకపోయేసరికి.. ఘాట్ రోడ్డులోని గోడకు ఢీకొట్టింది. బారీకేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com