సుప్రీం డెడ్లైన్తో సీబీఐ పరుగులు..నెక్స్ట్ టార్గెట్ ఎంపీ అవినాష్?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు సుప్రీం కోర్టు పెట్టిన డెడ్లైన్తో సీబీఐ పరుగులు పెడుతోంది. రెండు వారాలే వ్యవధి ఉండడంతో.. కేసులో మరింత వేగం పెంచింది. సుప్రీం డెడ్లైన్ ఈనెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామునే పులివెందుల వెళ్లిన సీబీఐ బృందం.. వైఎస్ భారతీ రెడ్డి మేనమామ.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్తో వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు చెలరేగాయి. సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ నెక్స్ట్ టార్గెట్ ఎంపీ అవినాష్ రెడ్డే అనే ప్రచారం జరుగుతోంది.
అటు.. 10 రోజుల వ్యవధిలో సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ ఈ కేసుపై ఎంతమేరకు ఉంటుందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనూ జగన్ ఢిల్లీ టూర్కు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. జగన్ ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఆయన వెంటే అవినాష్ రెడ్డి ఉన్నారు. సీబీఐ దూకుడుగా వెళ్తున్న ప్రతిసారీ ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లారని.. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఢిల్లీ టూరంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com