ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత..!

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత..!
సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.

సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.. సీబీఐ, నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.. ఈ వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story