YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌కు ఊరట..

YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌కు ఊరట..
YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామ్‌సింగ్‌పై నమోదుచేసిన కేసుపై స్టే విధించింది. కడప కోర్టు ఆదేశాలతో రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయగా.. సీబీఐ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదుచేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తదనంతర చర్యలన్నింటిపై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. రామ్‌సింగ్‌పై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story