CBN: రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి 15 రోజులకు రాజధాని పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కొన్ని సంస్థలు.. వర్క్ ఫోర్స్.. మెషినరీ.. పూర్తి స్థాయిలో కేటాయించలేదన్నారు. ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగు పరుచుకోవలని సూచించారు.. ఇక, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలో రాజధాని రైతులతో సమావేశం అవ్వనున్నట్టు వెల్లడించారు.. రాజధాని రైతులతో త్వరలో సమావేశం అవుతా.. రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. కాగా, గతంలో అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని గుర్తు చేసిన విషయం విదితమే.. ఇక, రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు.. వాటి రిజిస్ట్రేషన్ విషయంలో.. కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఇష్టమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని.. ఈ మధ్యే మంత్రి నారాయణ మండిపడ్డారు.. రైతులకు న్యాయం చేస్తామని.. వీలైనంత త్వరలో వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం మని మంత్రి నారాయణ స్పష్టం చేశారు..
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు అందించారు. ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని, ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని వెల్లడించారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

