CBN: తెలుగు వాళ్లే నెంబర్ వన్‌గా ఉండాలి

CBN: తెలుగు వాళ్లే నెంబర్ వన్‌గా ఉండాలి
X
జ్యూరిక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష... తెలుగు డయాస్పోరాతో సమావేశమైన ముఖ్యమంత్రి... అన్ని దేశాల్లో 400 తెలుగు సంఘాలు ఉన్నాయి

ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న తె­లు­గు­వా­రి ప్ర­తిభ, శ్రమ, సం­స్కృ­తి కల­యి­క­తో 2047 నా­టి­కి తె­లు­గు­స­మా­జా­న్ని ప్ర­పం­చం­లో­నే నం­బ­ర్‌­వ­న్‌ కమ్యూ­ని­టీ­గా ని­ల­బె­ట్టా­ల­న్న స్ప­ష్ట­మైన లక్ష్యా­న్ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు ప్ర­క­టిం­చా­రు. యూ­ర­ప్‌­లో­ని స్వి­ట్జ­ర్లాం­డ్‌ నగరం జ్యూ­రి­క్‌­లో ని­ర్వ­హిం­చిన తె­లు­గు డయా­స్పో­రా సమా­వే­శం­లో ఆయన చే­సిన ప్ర­సం­గం, వి­దే­శా­ల్లో స్థి­ర­ప­డిన తె­లు­గు­వా­రి పా­త్ర, భారత ఆర్థిక భవి­ష్య­త్‌, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అభి­వృ­ద్ధి వ్యూ­హా­ల­పై సమ­గ్ర దృ­ష్టి­ని ఆవి­ష్క­రిం­చిం­ది. ఐటీ రం­గం­లో తీ­సు­కు­న్న దూ­ర­దృ­ష్టి ని­ర్ణ­యాల ఫలి­తం­గా నేడు 195 దే­శా­ల్లో తె­లు­గు­వా­రు ఉన్నా­ర­ని, అదే పు­నా­ది­పై రా­ష్ట్రా­న్ని గ్లో­బ­ల్‌ బ్రాం­డ్‌­గా తీ­ర్చి­ది­ద్దు­తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు వి­వ­రిం­చా­రు. జ్యూ­రి­క్‌­లో జరి­గిన డయా­స్పో­రా సమా­వే­శం­లో మా­ట్లా­డిన సీఎం, తన అను­భ­వా­ల­ను గు­ర్తు­చే­స్తూ 1995 నుం­చి ఈ నగ­రా­ని­కి వస్తు­న్నా­న­ని చె­ప్పా­రు. అప్ప­ట్లో యూ­ర­ప్‌­లో తె­లు­గు­వా­రి సం­ఖ్య చాలా తక్కు­వ­గా ఉం­డే­ద­ని, నేడు జ్యూ­రి­క్‌­లో­నే కాదు స్వి­ట్జ­ర్లాం­డ్‌­తో పాటు ఐర్లాం­డ్‌, స్వీ­డ­న్‌, నె­ద­ర్లాం­డ్స్‌, ఇటలీ, డె­న్మా­ర్క్‌, ఫి­న్‌­లాం­డ్‌ వంటి దే­శా­ల్లో వేల సం­ఖ్య­లో తె­లు­గు­వా­రు ని­వ­సి­స్తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. సమా­వే­శా­ని­కి హా­జ­రైన జన­స­మూ­హా­న్ని చూ­స్తే తె­లు­గు ప్రాం­తం­లో­నే ఉన్న­ట్టు­గా అని­పి­స్తోం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. వి­దే­శా­ల్లో ఉన్న­ప్ప­టి­కీ తె­లు­గు సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­ల­ను గౌ­ర­వి­స్తూ వా­టి­ని కొ­న­సా­గిం­చ­డం ప్ర­శం­స­నీ­య­మ­ని అన్నా­రు. తె­లు­గు డయా­స్పో­రా సం­ఘ­టిత శక్తి­ని వి­వ­రిం­చిన చం­ద్ర­బా­బు, ఒక్క జ్యూ­రి­క్‌­లో­నే రెం­డు లక్షల మం­ది­కి పైగా సభ్యు­ల­తో నా­న్‌-రె­సి­డెం­ట్‌ తె­లు­గు సం­ఘా­లు ఉన్నా­య­ని చె­ప్పా­రు.

ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా కలి­పి సు­మా­రు 400 తె­లు­గు సం­ఘా­లు క్రి­యా­శీ­ల­కం­గా పని­చే­స్తు­న్నా­య­ని, ఇవ­న్నీ పర­స్పర సహ­కా­రం­తో సా­మా­జిక సే­వ­లు, సాం­స్కృ­తిక కా­ర్య­క్ర­మా­లు, యువత అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు చే­ప­డు­తు­న్నా­య­ని తె­లి­పా­రు. వి­దే­శా­ల్లో జీ­వి­స్తు­న్నా తె­లు­గు గు­ర్తిం­పు­ను ని­లు­పు­కో­వ­డం మా­త్ర­మే కా­కుం­డా, ఆయా దే­శాల అభి­వృ­ద్ధి­లో భా­గ­స్వా­ము­ల­వు­తూ గౌ­ర­వా­న్ని సం­పా­ది­స్తు­న్నా­ర­ని ఆయన అభి­నం­దిం­చా­రు. 1995లోనే ఐటీ రంగం భవి­ష్య­త్తు­ను గు­ర్తిం­చి దా­ని­పై దృ­ష్టి పె­ట్టిన వి­ష­యా­న్ని సీఎం గు­ర్తు చే­శా­రు. ఆ సమ­యం­లో తన ఆలో­చ­న­ల­ను చాలా మంది ఎగ­తా­ళి చే­శా­ర­ని, కానీ అదే ఐటీ­ని ప్రో­త్స­హిం­చిన ఫలి­తం­గా నేడు ప్ర­పం­చం­లో­ని 195 దే­శా­ల్లో తె­లు­గు­వా­రు వి­విధ రం­గా­ల్లో కీలక స్థా­నా­ల్లో ఉన్నా­ర­ని వి­వ­రిం­చా­రు. ఐటీ మా­త్ర­మే కాదు, వి­ద్య, ఆరో­గ్యం, పరి­శో­ధన, స్టా­ర్ట­ప్‌ ఎకో­సి­స్ట­మ్‌­ల­లో కూడా తె­లు­గు­వా­రి ము­ద్ర స్ప­ష్టం­గా కని­పి­స్తోం­ద­ని చె­ప్పా­రు. ఈ గ్లో­బ­ల్‌ నె­ట్‌­వ­ర్క్‌ దే­శా­ని­కి, రా­ష్ట్రా­ని­కి గొ­ప్ప ఆస్తి­గా మా­రిం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. భా­ర­త­దేశ ఆర్థిక భవి­ష్య­త్తు­పై కూడా చం­ద్ర­బా­బు వి­శ్లే­షణ చే­శా­రు. భా­ర­త్‌­కు అతి­పె­ద్ద బలం యువ జనా­భా అని, ఈ డె­మో­గ్రా­ఫి­క్‌ డి­వి­డెం­డ్‌­ను సద్వి­ని­యో­గం చే­సు­కుం­టే దేశం వే­గం­గా ఎదు­గు­తుం­ద­ని అన్నా­రు. 2028 నా­టి­కి భా­ర­త్‌ ప్ర­పం­చం­లో మూడో అతి­పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా అవ­త­రి­స్తుం­ద­న్న అం­చ­నా­ల­ను ఆయన ప్ర­స్తా­విం­చా­రు.

ఏపీ సిద్ధంగా ఉంది:లోకేశ్

వర­ల్డ్ ఎక­నా­మి­క్ ఫో­ర­మ్2026 సద­స్సు­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం సర్వ­స­న్న­ద్ధ­మైం­ద­ని రా­ష్ట్ర ఐటీ, వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్ స్ప­ష్టం చే­శా­రు. ఏపీ­ని ఒక నమ్మ­క­మైన గ్లో­బ­ల్ ఇన్వె­స్ట్‌­మెం­ట్ గమ్య­స్థా­నం­గా ని­ల­ప­డ­మే తమ ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు దా­ర్శ­ని­క­త­ను గు­ర్తు చే­స్తూ.. 90వ దశ­కం­లో­నే భా­ర­త­దే­శం నుం­చి ప్ర­పంచ స్థా­యి గు­ర్తిం­పు పొం­దిన తొలి గ్లో­బ­ల్ బ్రాం­డ్ అం­బా­సి­డ­ర్ల­లో ఆయన ఒక­ర­ని లో­కే­శ్ కొ­ని­యా­డా­రు. కే­వ­లం ఎం­ఓ­యూ­ల­పై సం­త­కా­లు చే­య­డం కో­స­మే కా­కుం­డా, ప్ర­పంచ వ్యా­ప్తం­గా వ్యా­పార, సాం­కే­తిక పో­క­డ­లు ఏ ది­శ­గా సా­గు­తు­న్నా­యో అర్థం చే­సు­కు­నేం­దు­కు దా­వో­స్ ఒక గొ­ప్ప వే­దిక అని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. దా­వో­స్ సద­స్సు అనే­ది అం­త­ర్జా­తీయ స్థా­యి ఆలో­చ­నల వి­ని­మ­యా­ని­కి కేం­ద్ర­మ­ని, ఇక్కడ జరి­గే చర్చ­లు భవి­ష్య­త్ ని­ర్ణ­యా­ల­కు మా­ర్గ­ద­ర్శ­కా­లు­గా ని­లు­స్తా­య­ని మం­త్రి పే­ర్కొ­న్నా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­లు, పా­రి­శ్రా­మిక వే­త్త­ల­తో దీ­ర్ఘ­కా­లిక సం­బం­ధా­ల­ను ఏర్ప­ర­చు­కో­వ­డా­ని­కి, స్థి­ర­మైన ఆలో­చ­న­ల­ను పం­చు­కో­వ­డా­ని­కి ఈ వే­దిక దో­హ­ద­ప­డు­తుం­ద­ని వి­వ­రిం­చా­రు. పె­ద్ద పె­ద్ద ని­ర్ణ­యా­లు తీ­సు­కు­నే ముం­దు ఎన్నో సవా­ళ్లు, ప్ర­శ్న­లు తలె­త్తు­తా­య­ని, వా­టి­ని అధి­గ­మిం­చేం­దు­కు అవ­స­ర­మైన పరీ­క్ష­లు ఇక్క­డే జరు­గు­తా­య­ని లో­కే­శ్ వె­ల్ల­డిం­చా­రు. బ్రాం­డ్ ఏపీ­ని అం­త­ర్జా­తీయ స్థా­యి­లో తి­రి­గి పు­న­రు­ద్ధ­రిం­చ­డం ద్వా­రా రా­ష్ట్రా­ని­కి భా­రీ­గా పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చి, యు­వ­త­కు ఉపా­ధి కల్పిం­చ­డ­మే తమ అం­తిమ ధ్యే­య­మ­ని మం­త్రి లో­కే­శ్ స్ప­ష్టం చే­శా­రు. ఏపీ­కి భా­రీ­గా పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చి ఉపా­ధి అవ­కా­శా­లు కల్పిం­చ­డ­మే తమ లక్ష్య­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

Tags

Next Story