CBN: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

CBN: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి
X

రా­జ­కీయ నా­య­కు­లు ని­రం­త­రం ప్ర­జ­ల్లో ఉంటూ వారి సమ­స్య­ల­ను ఎప్ప­టి­క­ప్పు­డు పరి­ష్క­రిం­చా­ల­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి, తె­లు­గు­దే­శం పా­ర్టీ అధి­నేత చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ని­రం­త­రం ప్ర­జ­ల్లో ఉండే వారే నా­య­కు­లు­గా రా­ణి­స్తా­ర­ని ఆయన చె­ప్పా­రు. ఈమే­ర­కు పా­ర్టీ నే­త­ల­తో ని­ర్వ­హిం­చిన టె­లి­కా­న్ఫ­రె­న్స్ లో ఆయన ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. ‘పేదల సే­వ­లో’ కా­ర్య­క్ర­మం­లో పా­ర్టీ నా­య­కు­లం­ద­రూ పా­ల్గొ­నా­ల­ని ఆయన పి­లు­పు­ని­చ్చా­రు. ని­త్యం ప్ర­జ­ల్లో­నే ఉంటూ, ప్ర­జల సమ­స్య­ల­ను తె­లు­సు­కుం­టూ ఎప్ప­టి­క­ప్పు­డు పరి­ష్క­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు. పిం­ఛ­న్ల పం­పి­ణీ­ని పేదల సే­వ­గా భా­విం­చా­ల­ని నే­త­ల­కు తె­లి­పా­రు. 'పే­దల సే­వ­లో' కా­ర్య­క్ర­మం­లో నా­య­కుల భా­గ­స్వా­మ్యం ప్ర­స్తు­తం 25 వే­ల­కు చే­రిం­ద­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు.

పిం­చ­న్ల పం­పి­ణీ­లో నేతల భా­గ­స్వా­మ్యం 25వే­ల­కు చే­రిం­ద­నీ, ఇది 35వే­ల­కు పె­ర­గా­ల­ని చం­ద్ర­బా­బు కో­రా­రు. నే­త­లు ని­రం­త­రం ప్ర­జ­ల­తో­నే ఉం­డా­ల­నీ. పిం­ఛ­న్ల పం­పి­ణీ కూడా.. పేదల సేవ కిం­ద­కే వస్తుం­ద­నీ.. అం­దు­వ­ల్ల ఈ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న­డం ద్వా­రా.. పే­ద­ల­కు మేలు జరు­గు­తుం­ద­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ని­రం­త­రం ప్ర­జ­ల్లో ఉండే వారే నా­య­కు­లు­గా రా­ణి­స్తా­ర­ని అన్నా­రు. పా­ర్టీ నే­త­ల­తో ని­ర్వ­హిం­చిన టెలి కా­న్ఫ­రె­న్స్‌­లో చం­ద్ర­బా­బు ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఐతే.. గత నె­ల­లో కూడా సీఎం ఇలా­గే సూ­చిం­చి­నా 23 మంది ఎమ్మె­ల్యే­లు.. పె­న్ష­న్ల పం­పి­ణీ­లో పా­ల్గొ­న­లే­దు. వా­రి­పై చర్య­లు తీ­సు­కుం­టా­న­ని సీఎం హె­చ్చ­రిం­చా­రు గానీ.. ఇప్ప­టి­వ­ర­కూ అలాం­టి­దే­దీ జర­గ­లే­దు. ప్ర­తి నెలా ఒకటో తే­దీన ఏదై­నా జి­ల్లా­కు వె­ళ్లి పిం­ఛ­ను ఇచ్చే సీఎం చం­ద్ర­బా­బు.. ఈసా­రి ఏలూ­రు జి­ల్లా­కి వె­ళ్తు­న్నా­రు. డి­సెం­బ­ర్ 1న ఆన.. ఏలూ­రు జి­ల్లా­లో జరి­గే కొ­న్ని కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొం­టా­రు. ముం­దు­గా.. ఉం­గు­టూ­రు మం­డ­లం గొ­ల్ల­గూ­డెం­కి వె­ళ్లి.. నే­త­లు అధి­కా­రు­ల్ని కలు­స్తా­రు.

చంద్రబాబు కీలక నిర్ణయం

మూడు ప్రాం­తాల అభి­వృ­ద్ధి­ని లక్ష్యం­గా పని­చే­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఈ ప్రాం­తా­ల­కు ప్ర­త్యేక జో­న్లు ఏర్పా­టు చే­స్తా­ము. అన్ని ప్రాం­తాల సమ­గ్రా­భి­వృ­ద్ధి­కి కృషి చే­స్తా­మ­న్నా­రు. మూడు ప్రాం­తా­లు ఏవి, జో­న్ల వి­వ­రా­లు ఇంకా పూ­ర్తి­గా ప్ర­క­టిం­చ­లే­దు. ఉత్త­రాం­ధ్ర, కో­స్తా , రా­య­ల­సీమ ప్రాం­తా­ల­కు జో­న్ల­ను ఏర్పా­టు చే­య­వ్చ­చు. ఈ జో­న్ల ద్వా­రా మౌ­లిక సదు­పా­యా­లు, పరి­శ్ర­మ­లు, వ్య­వ­సా­యం, టూ­రి­జం వంటి రం­గా­ల్లో పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చా­ల­ని ప్ర­భు­త్వం లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. రైతు సమ­స్యల పరి­ష్కా­రం­లో తొ­లుత కొంత గ్యా­ప్‌ ఉన్న మాట ని­జ­మే­న­న్నా­రు. నాతో సమా­వే­శం తర్వాత రై­తు­ల­కు అన్నిం­టి­పై­నా స్ప­ష్టత వచ్చిం­ది.. రా­జ­ధా­ని రై­తు­లు కూడా ఆనం­దం­గా ఉన్నా­రు. రెం­డో దశ భూ­స­మీ­క­రణ ఉప­యో­గా­ల­ను రై­తు­ల­కు వి­వ­రిం­చా.. అమ­రా­వ­తి ము­న్సి­పా­లి­టీ­గా మి­గి­లి­పో­కూ­డ­ద­న్నా­రు. అమ­రా­వ­తి మహా­న­గ­రం­గా మా­రి­తే వచ్చే ఫలి­తా­లు రై­తు­లు అర్థం చే­సు­కు­న్నా­ర­ని సీఎం తె­లి­పా­రు. త్రి­స­భ్య కమి­టీ ని­రం­త­రం రై­తు­ల­తో సం­ప్ర­దిం­పు­లు జరు­పు­తుం­ది.. రా­జ­ధా­ని అభి­వృ­ద్ధి ఇక అన­స్టా­ప­బు­ల్‌ అని స్ప­ష్టం చే­శా­రు. రా­జ­ధా­ని చు­ట్టు­ప­క్కల ప్రాం­తా­ల్లో లే­అ­వు­ట్ల సమ­స్య త్వ­ర­లో­నే పరి­ష్క­రి­స్తా­మ­ని.. గో­దా­వ­రి పు­ష్క­రాల నా­టి­కి పో­ల­వ­రం పూ­ర్తి­చే­సే ది­శ­గా కృ­షి­చే­స్తు­న్నా­మ­న్నా­రు.

Tags

Next Story