CBN: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సహకాలు

CBN: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సహకాలు
X
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సహకాలు... తగ్గించే ప్రతి కట్టకు రూ.800 ఇస్తామని వెల్లడి

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కీలక ప్ర­క­టన చే­శా­రు. వచ్చే ఏడా­ది నుం­చి యూ­రి­యా వా­డ­కం తగ్గిం­చే రై­తు­ల­కు ప్రో­త్సా­హ­కా­లు అం­ది­స్తా­మ­న్నా­రు. తగ్గిం­చే ప్ర­తి కట్ట­కు రూ.800 నే­రు­గా రై­తు­కు అం­ది­స్తా­మ­ని చె­ప్పా­రు. రైతు నష్ట­పో­కూ­డ­దు, ప్ర­జా­రో­గ్యం బా­గుం­డా­ల­ని పే­ర్కొ­న్నా­రు. కలె­క్ట­ర్ల సద­స్సు­లో వ్య­వ­సాయ రం­గం­పై చర్చ సం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డా­రు. యూ­రి­యా వా­డ­కం వల్ల పంట ఉత్ప­త్తు­ల్లో రసా­య­నా­లు పె­రి­గి­పో­యి మన పం­ట­ల­కు వి­దే­శా­ల్లో డి­మాం­డ్ తగ్గి­పో­తోం­ద­ని చం­ద్ర­బా­బు కలె­క్ట­ర్ల సమా­వే­శం­లో వ్యా­ఖ్యా­నిం­చా­రు. "కొ­న్ని సం­ద­ర్భా­ల్లో చైనా నుచి మి­ర్చి వె­న­క్కి వచ్చిం­ది. అలా­గే యూ­ర­ప్ దే­శా­ల్లో మన వ్య­వ­సాయ ఉత్ప­త్తు­లుక ధరలు తగ్గి­స్తు­న్నా­రు. ఇలాం­టి పరి­స్థి­తు­ల్లో పూ­ర్తి స్థా­యి­లో రసా­య­నా­లు తగ్గిం­చే­లా పం­ట­లు పం­డిం­చా­ల్సి ఉంది" అని ము­ఖ్య­మం­త్రి అభి­ప్రా­య­ప­డ్డా­రు. యూ­రి­యా వా­డ­కం­పై రై­తు­ల­కు చై­త­న్యం కల్పిం­చా­ల­ని, అవ­స­ర­మై­నంత మా­త్ర­మే యూ­రి­యా­ను వి­ని­యో­గిం­చా­ల­ని సూ­చిం­చా­రు. అధిక యూ­రి­యా వా­డ­కం ది­గు­బ­డి­ని పెం­చు­తుం­ద­నే భావన సరి­కా­ద­ని స్ప­ష్టం చే­శా­రు. యూ­రి­యా­కు బదు­లు­గా మై­క్రో న్యూ­ట్రి­యం­ట్స్‌­ను సప్లి­మెం­ట్స్‌­గా వా­డా­ల­ని, వచ్చే ఏడా­ది నుం­చి ఈ వి­ధా­నా­న్ని అమలు చే­యా­ల­ని చె­ప్పా­రు. పం­జా­బ్‌­లో యూ­రి­యా అతి­వా­డ­కం వల్ల సం­భ­విం­చిన పరి­ణా­మా­ల­ను కేస్ స్ట­డీ­గా చూసి నే­ర్చు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. రై­తు­ల­కు సు­స్థిర వ్య­వ­సాయ పద్ధ­తు­ల­ను ప్రో­త్స­హిం­చ­డం­తో­పా­టు, ఆరో­గ్య, పర్యా­వ­రణ పరి­ర­క్ష­ణ­కు ప్రా­ధా­న్యత ఇవ్వా­ల­ని చం­ద్ర­బా­బు భా­వి­స్తు­న్నా­రు.

క్యాన్సర్ పంజా విసురుతోంది

‘‘యూ­రి­యా ఎక్కువ వా­డ­టం వల్ల క్యా­న్స­ర్‌ వస్తుం­ది. దీని వా­డ­కం­పై రై­తు­ల్లో చై­త­న్యం తీ­సు­కు­రా­వా­లి. ఏపీ­లో క్యా­న్స­ర్‌ టా­ప్‌-5 రో­గాల జా­బి­తా­లో ఉంది. వా­డ­కం ఇలా­గే కొ­న­సా­గి­తే క్యా­న్స­ర్‌­లో నం­బ­ర్‌-1కి వె­ళ్లి­పో­తాం. వచ్చే ఏడా­ది నుం­చి ఎం­త­వ­ర­కు అవ­స­ర­మో అంతే వి­ని­యో­గిం­చా­లి. మై­క్రో న్యూ­ట్రి­యం­ట్స్‌ సప్లి­మెం­ట్స్‌ కింద ఇవ్వా­లి. యూ­రి­యా ఎక్కువ వా­డి­తే ఎక్కువ పంట వస్తుం­ద­ను­కో­వ­డం సరి­కా­దు.’’ అని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఈ ప్ర­క­ట­న­తో డబు­ల్ ఇం­జి­న్ సర్కా­ర్ లక్ష్య­మైన డబు­ల్ డి­జి­ట్ గ్రో­త్‌­ను సా­ధిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. అధిక యూ­రి­యా వా­డ­కం పర్యా­వ­ర­ణా­ని­కి, ఆరో­గ్యా­ని­కి హా­ని­క­ర­మ­ని, స్థి­ర­మైన వ్య­వ­సా­యా­ని­కి ఇది చాలా కీ­ల­క­మ­ని నొ­క్కి చె­ప్పా­రు. ఈ ప్రో­త్సా­హ­కాల వల్ల రై­తుల ఆదా­యం పె­రు­గు­తుం­ద­ని, రా­ష్ట్ర ఆర్థిక వృ­ద్ధి­కి దో­హ­ద­ప­డు­తుం­ద­ని తె­లు­స్తోం­ది. ‘‘నై­పు­ణ్య గణ­న­పై డేటా అప్‌­డే­ట్‌ చేసి ప్ర­చు­రి­స్తాం. నై­పు­ణ్య శి­క్షణ కూడా ని­రం­త­రం కొ­న­సా­గు­తుం­ది. యు­వ­త­కు జా­బ్‌ మే­ళా­లు ని­ర్వ­హిం­చా­ల్సిన అవ­స­రం ఉంది. మూ­త­ప­డిన నై­పు­ణ్య శి­క్షణ కేం­ద్రా­ల­ను కూడా తె­రి­చాం. ప్ర­తి అం­శా­న్ని క్రి­యే­టి­వ్‌­గా ఆలో­చిం­చం­డి’’ అని కలె­క్ట­ర్ల­కు సూ­చిం­చా­రు.

Tags

Next Story