CBN: "అవతార్" కంటే రామాయణం, మహా భారతం గొప్పవి

CBN: అవతార్ కంటే రామాయణం, మహా భారతం గొప్పవి
X
తల్లిదండ్రులకు చంద్రబాబు సూచన... రామయణ, భారతాలు చాలా అరుదైనవి.. పురణాల గొప్పతనాన్ని చాటిచెప్పండి.. ఎన్టీఆర్ అవతార పురుషుడన్న సీఎం

భారత సం­స్కృ­తి, సాం­ప్ర­దా­యా­లు ప్ర­పం­చం­లో­నే అరు­దైన, గొ­ప్ప వి­ష­యా­ల­ని.. అవ­తా­ర్ సి­ని­మా కంటే భా­ర­తం, రా­మా­య­ణం గొ­ప్ప­వ­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. హా­లీ­వు­డ్ సూ­ప­ర్ స్టా­ర్లు, బ్యా­ట్‌­మ­న్, అవెం­జ­ర్స్ కంటే అర్జు­ను­డు గొ­ప్ప యో­ధు­డు అని పి­ల్ల­ల­కు మనం చె­ప్పా­ల­ని సూ­చిం­చా­రు. వేల ఏళ్ల కిం­ద­టే ప్ర­పం­చా­ని­కి ఆయు­ర్వేద వై­ద్యం­తో పాటు అర్బ­న్ టౌన్ ప్లా­నిం­గ్ నే­ర్పిం­చిన ఘనత భా­ర­త్‌­కు దక్కు­తుం­ద­న్నా­రు. తి­రు­ప­తి­లో­ని జా­తీయ సం­స్కృత వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో శు­క్ర­వా­రం ని­ర్వ­హిం­చిన భా­ర­తీయ వి­జ్ఞా­న్ సమ్మే­ళ­న్ కా­ర్య­క్ర­మం­లో సీఎం చం­ద్ర­బా­బు పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. దేశ సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­ల­ను పరి­ర­క్షి­స్తూ దే­శా­భి­వృ­ద్ధి కోసం ఆర్ఎ­స్ఎ­స్ చీఫ్ మో­హ­న్ భగ­వ­త్ చే­స్తు­న్న కృ­షి­ని కొ­ని­యా­డా­రు. అవ­తా­ర్‌ సి­ని­మా కంటే భా­ర­తం, రా­మా­య­ణా­లు గొ­ప్ప­వ­ని పి­ల్ల­ల­కు చె­ప్పా­ల్సిన బా­ధ్యత మనపై ఉం­ద­ని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు. ఎవరు మం­చి­వా­ళ్లో.. ఎవరు చె­డ్డ­వా­ళ్లో వి­వ­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు. దీ­ని­వ­ల్ల పి­ల్ల­ల­కు మంచి, చె­డుల మధ్య వ్య­త్యా­సా­లు తె­లు­స్తా­య­న్నా­రు. ప్ర­జ­లు పు­రా­ణాల గు­రిం­చి మరి­చి­పో­యే సమ­యం­లో ఎన్టీ­ఆ­ర్‌ ఎన్నో పు­రా­ణ­గా­థ­ల­తో కూ­డిన సి­ని­మా­లు చే­శా­ర­ని గు­ర్తు­చే­శా­రు. వాటి ద్వా­రా చై­త­న్యం తె­చ్చిన గొ­ప్ప నా­య­కు­డు ఆయన అని కొ­ని­యా­డా­రు. రా­జ­కీ­యా­ల్లో­నూ అదే స్థా­యి­లో వి­లు­వ­లు పా­టిం­చా­ర­న్నా­రు.

దే­శా­భి­వృ­ద్ధి­కి మాజీ ప్ర­ధా­ని వా­జ్‌­పే­యీ గతం­లో పు­నా­దు­లు వే­శా­ర­ని.. ఇప్పు­డు ప్ర­ధా­ని మోదీ అద్భు­తం­గా అభి­వృ­ద్ధి చే­స్తు­న్నా­ర­ని చె­ప్పా­రు. వి­నూ­త్న ఆలో­చ­న­ల­తో కొ­త్త ఆవి­ష్క­ర­ణ­లు చే­ప­ట్టా­ల­న్నా­రు. భవి­ష్య­త్తు­లో మన­దే­శం సూ­ప­ర్‌ పవ­ర్‌ కా­బో­తోం­ద­ని చె­ప్పా­రు.

"దే­శా­భి­వృ­ద్ధి వి­ష­యం­లో భా­ర­త­ అద్భు­త­మైన ప్ర­స్థా­నా­న్ని కొ­న­సా­గి­స్తోం­ది. మాజీ ప్ర­ధా­ని వాజ్ పేయి అభి­వృ­ద్ధి­కి గట్టి పు­నా­దు­లు వే­య­గా, ప్ర­స్తు­తం ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ నా­య­క­త్వం­లో దేశం వే­గం­గా దూ­సు­కు­పో­తోం­ది. యువత వి­నూ­త్న ఆలో­చ­న­ల­తో కొ­త్త ఆవి­ష్క­ర­ణ­లు చే­ప­ట్టా­ల­ని, తద్వా­రా భా­ర­త­దే­శం భవి­ష్య­త్తు­లో ప్ర­పంచ దే­శా­ల­న్నిం­టి­కీ నా­య­క­త్వం వహిం­చే సూ­ప­ర్ పవ­ర్‌­గా మా­రు­తుం­ది. . సమా­జం పు­రా­ణా­ల­ను మర్చి­పో­తు­న్న తరు­ణం­లో నం­ద­మూ­రి తారక రా­మా­రా­వు తన సి­ని­మాల ద్వా­రా ఆ పు­రాణ గా­థ­ల­ను ప్ర­జల గుం­డె­ల్లో­కి తీ­సు­కె­ళ్లా­రు. కే­వ­లం సి­ని­మా­ల్లో­నే కా­కుం­డా, రా­జ­కీ­యా­ల్లో కూడా వి­లు­వ­ల­ను పా­టి­స్తూ ప్ర­జ­ల్లో గొ­ప్ప చై­త­న్యా­న్ని తీ­సు­కు­వ­చ్చిన మహా­నేత ఎన్టీ­ఆ­ర్. మన మూ­లా­ల­ను గౌ­ర­వి­స్తూ­నే, ఆధు­నిక సాం­కే­తి­క­త­ను అం­ది­పు­చ్చు­కు­ని ముం­దు­కు సా­గ­డ­మే నేటి తరా­ని­కి అవ­స­ర­మ­ని’ చం­ద్ర­బా­బు పి­లు­పు­ని­చ్చా­రు.

భారత్ ఓ విజ్ఞాన భాండగారం

మన దేశ విశిష్టతను, భారతీయతను చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఒక అద్భుతమైన వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలం నుండే భారతదేశం విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లిందని, వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా మన పూర్వీకులు అద్భుతమైన అర్బన్ ప్లానింగ్‌ను ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద గురించి వివరిస్తూ, సుమారు 2900 ఏళ్ల క్రితమే భారతీయులు యోగాభ్యాసాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో భారతదేశం సాధించిన నైపుణ్యాన్ని వివరిస్తూ ఆస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావుల సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు.

Tags

Next Story