CBN: పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం

CBN: పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం
X
వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయండి...పీపీపీపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం పిలుపు

స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధన కోసం రూపొందించిన పది సూత్రాల్ని పది మిషన్లుగా నిర్దేశించుకుని అన్ని శాఖలూ పని చేయాలని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. పేదరికం లేని సమాజం అనే మిషన్‌లో భాగంగా ప్రతి కుటుంబానికి సాధికారత, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ‘స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌లో భాగంగా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలి. ప్రతి ప్రభుత్వ శాఖ సూచికలు సిద్ధం చేసుకుని పనిచేయాలి. వాటి అమలును విజన్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలి. జనాభా నిర్వహణకు విధానం రూపొందించాలి. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 30 లక్షల పేద (బీపీఎల్‌) కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలి. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనను అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలి’ అని చంద్రబాబు ఆదేశించారు.

పే­ద­ల­కు నా­ణ్య­మైన వై­ద్యం, వై­ద్య వి­ద్య­ను అం­దిం­చే వి­ష­యం­లో రాజీ పడే­ది లే­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు. దే­శ­వ్యా­ప్తం­గా ప్ర­భు­త్వ, ప్రై­వే­ట్‌ భా­గ­స్వా­మ్య (పీ­పీ­పీ) వి­ధా­నం అమ­ల్లో ఉం­ద­ని.. దీని వి­ష­యం­లో వె­న­క్కి తగ్గా­ల్సిన అవ­స­రం లే­ద­ని గు­ర్తు­చే­శా­రు. రా­ష్ట్రం­లో పే­ద­ల­కు నా­ణ్య­మైన కా­ర్పొ­రే­ట్‌ వై­ద్యం అం­దిం­చేం­దు­కు.. ని­ర్దే­శిం­చిన పీ­పీ­పీ వి­ధా­నం­లో వై­ద్య కళా­శా­లల ని­ర్మా­ణా­ని­కి టెం­డ­ర్ల ప్ర­క్రియ వే­గ­వం­తం చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. దీ­ని­పై దు­ష్ప్ర­చా­రా­న్ని తి­ప్పి­కొ­ట్టా­ల­న్నా­రు. వై­ద్యా­రో­గ్య శా­ఖ­పై సచి­వా­ల­యం­లో సీఎం బు­ధ­వా­రం సమీ­క్షిం­చా­రు. పీ­పీ­పీ వి­ధా­నం­లో చే­ప­ట్టిన వై­ద్య కళా­శా­లల ని­ర్మా­ణా­ని­కి కేం­ద్ర ప్ర­భు­త్వం మా­ర్గ­ద­ర్శ­కా­ల­కు అను­గు­ణం­గా వయ­బి­లి­టీ గ్యా­ప్‌ ఫం­డ్‌ (వీ­జీ­ఎ­ఫ్‌) సహా ఇతర ప్రో­త్సా­హ­కా­లు ఇవ్వా­ల­ని ఆదే­శిం­చా­రు. ఈ వి­ధా­నం­లో ఆసు­ప­త్రు­లు, వై­ద్య కళా­శా­లల ని­ర్మా­ణం, మౌ­లిక వస­తుల కల్ప­న­పై కేం­ద్ర ప్ర­భు­త్వ సూ­చ­న­లు, మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను ము­ఖ్య­మం­త్రి­కి అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. సా­మా­జిక- ఆరో­గ్య రం­గా­ని­కి ప్ర­త్యేక ప్రా­ధా­న్య­మి­స్తూ పీ­పీ­పీ ప్రా­జె­క్టు­ల­కు మద్ద­తి­వ్వా­ల­న్న ఉద్దే­శం­తో వీ­జీ­ఎ­ఫ్‌ కింద అం­దిం­చే 60 శాతం ఆర్థిక చే­యూ­త­ను కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు చెరి 30% చొ­ప్పున భరిం­చా­ల­ని కేం­ద్రం సూ­చిం­చిం­ద­ని చె­ప్పా­రు. వీ­జీ­ఎ­ఫ్‌ ద్వా­రా అరు­ణా­చ­ల్‌­ప్ర­దే­శ్, ఝా­ర్ఖం­డ్, ఉత్త­ర్‌­ప్ర­దే­శ్‌ లాం­టి రా­ష్ట్రా­ల్లో ఆసు­ప­త్రు­లు, వై­ద్య కళా­శా­ల­లు ని­ర్మిం­చేం­దు­కు ఆర్థిక వ్య­వ­హా­రాల వి­భా­గం ఇప్ప­టి­కే అను­మ­తు­లు ఇచ్చిం­ద­ని గు­ర్తు­చే­శా­రు. ఆరో­గ్య మౌ­లిక వస­తుల అభి­వృ­ద్ధి­కి కేం­ద్రం పీ­పీ­పీ వి­ధా­నా­న్ని ప్రో­త్స­హి­స్తోం­ద­న్నా­రు. ప్ర­భు­త్వం తొలి వి­డ­త­గా ఆదో­ని, మద­న­ప­ల్లె, మా­ర్కా­పు­రం, పు­లి­వెం­దుల వై­ద్య కళా­శా­ల­ల­కు ఆహ్వా­నిం­చిన టెం­డ­ర్ల తాజా పరి­స్థి­తి­ని అధి­కా­రు­లు ము­ఖ్య­మం­త్రి­కి వి­వ­రిం­చా­రు.

నగర నిర్మాణంలో సోల్:లోకేశ్

ఆధు­నిక నగ­రాల రూ­ప­క­ల్ప­న­పై మం­త్రి నారా లో­కే­శ్ చే­సిన ట్వీ­ట్ ప్ర­స్తు­తం ఎక్స్ వే­ది­క­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. లిం­క్డ్‌­ఇ­న్‌­లో వచ్చిన ఒక వి­శ్లే­ష­ణా­త్మక పో­స్టు­ను ప్ర­స్తా­విం­చిన ఆయన, నగ­రాల అభి­వృ­ద్ధి భా­వో­ద్వే­గాల ప్ర­ద­ర్శ­న­గా కా­కుం­డా స్ప­ష్టత, క్ర­మ­శి­క్షణ, కా­ర్యా­చ­ర­ణా­త్మక ప్ర­ణా­ళి­క­ల­పై ఆధా­ర­ప­డా­ల­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. నగర ని­ర్మా­ణం­లో ‘సోల్’ అనే పే­రు­తో అధిక నా­ట­కీ­య­త­కు ప్రా­ధా­న్యం ఇవ్వ­డం అవ­స­రం లే­ద­ని, బదు­లు­గా సమ­ర్థ­వం­త­మైన ప్ర­ణా­ళిక, సమ­య­పా­లన, పని చేసే వ్య­వ­స్థ­లే అస­లైన బల­మ­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. మౌ­లిక వస­తు­లు నమ్మ­కం­గా పని­చే­సే వి­ధం­గా ఉం­డా­లి, ని­య­మా­లు స్ప­ష్టం­గా ఉం­డా­లి, అప్పు­డు మా­త్ర­మే ప్ర­జ­లు ఆటం­కా­లు లే­కుం­డా జీ­విం­చేం­దు­కు, ఆశ­యా­ల­ను సా­ధిం­చేం­దు­కు స్వే­చ్ఛ లభి­స్తుం­ద­ని ఆయన ట్వీ­ట్‌­లో తె­లి­పా­రు.

Tags

Next Story